▪ గుండె బరువెక్కింది..
▪ ఇంత ఎమోషన్ సినిమా ఎప్పుడూ చూడలేదు..
▪ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు
▪ ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు సత్యప్రకాష్
▪ గ్లిజరిన్ పెట్టుకోకుండానే షూటింగ్లో కన్నీళ్లు వచ్చాయి: సత్యప్రకాష్
▪ థియేటర్లలో విడుదలకు సన్నాహాలు
తెలుగులో మరో హార్ట్ టచింగ్ మూవీ రాబోతోంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్దేష్ దర్శకత్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో సత్యప్రకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘నాన్నా మళ్లీ రావా..!’. సత్యప్రకాష్, ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష తదితరులు నటించిన ఈ మూవీ ప్రివ్యూ షో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. ‘నాన్నా మళ్లీ రావా..!’ ప్రివ్యూ వీక్షించిన అనంతరం పలువురు భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చూస్తున్న సమయంలో కన్నీళ్లు ఆగలేదని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గ్లిజరిన్ పెట్టుకోకుండానే ప్రతి రోజు తనకు కన్నీళ్లు వచ్చాయి. సినిమా షూటింగ్ అని కాకుండా తనకు జరుగుతున్న నిజ సందర్భాల్లాగే తాను ఫీలయ్యాను, దీనికి కారణం దర్శకుడు నిర్దేష్ గారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కారణం. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి, కుటుంబ సమేతంగా చూడగలిగే దర్శకుడు తీర్చిదిద్దారు” అని తెలిపారు.
దర్శకుడు నిర్దేష్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రివ్యూ ప్రదర్శన అనంతరం చూసిన వారి స్పందనను బట్టి ఒక మంచి సినిమా చేశామన్న నమ్మకం కుదిరింది. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నాం..” అని చెప్పారు.
హీరో రిత్విక్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను కేశవ్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నిజజీవితంలో నాన్న పాత్ర ఎంతో విలువైందో తెలిసింది. షూటింగ్ సమయంలోనే గుండె బరువెక్కిన సంఘటన జరిగింది. నాన్నతో పాటు, ఈ సినిమా నా గుండెల్లో ఎప్పుడు నిలిచే ఉంటుంది.” అని అన్నారు.
తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నచ్చే సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కినట్టు ఈ చిత్ర నిర్మాత డా. ఉమారావు ధన్యవాదాలు చెప్పారు. సెన్సార్ పూర్తి కాగానే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.