పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేవల్లి శరణ్ చౌదరి

హైద‌రాబాద్‌:
ఎన్నిక‌ల వేడి మొద‌ల‌వ్వ‌డంతో కూక‌ట్‌ప‌ల్లి రాజ‌కీయం కూడా హీటెక్కింది. ఈ సారి ఎలాగైన బీజేపీ జెండా ఎగ‌రేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీ ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టేసింది. ఈ మేర‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్‌పల్లిలో పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సాధక బాధకాలను తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమంతో నియోజకవర్గంలోని కుటుంబాలను కలిసి ప్రధాని న‌రేంద్ర‌ మోదీ సుపరిపాలన, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు.

ప్రజల వద్దకు వెళుతూ ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్న‌ట్టు వడ్డేవల్లి శరణ్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన చూస్తే త‌మ‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నదని, మోదీ పట్ల అభిమానం, బీజేపీ పట్ల ఆదరణ చూస్తుంటే, త‌మ లక్ష్యాన్ని మించి ప్రజల గుండెల్లో చేరుకోగలుగుతామన్న విశ్వాసం కలుగుతోంద‌ని అన్నారు. రాబోవు ఎన్నికల వరకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల మధ్య ఉంటూ కూకట్‌పల్లిలో కాషాయ జెండా ఎగురేస్తాం అని శరణ్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *