తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) ‘మన తెలంగాణ బడి’ ప్రాజెక్టులో భాగంగా టీడీఎఫ్ – యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ వారి సహకారంతో ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కి 5 కంప్యూటర్లు అందించారు. గత 25 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న టీడీఎఫ్ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్స్ కి మౌలిక సదుపాయాలు అందించే ‘మన తెలంగాణ బడి’లో భాగంగా ఈసారి నామాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు టీడీఎఫ్ అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి సహకారంతో కంప్యూటర్లు అందించారు. ఈ ప్రాజెక్టు కృషిచేసిన టీడీఎఫ్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ స్వాతి సూదిని, విక్రమ్ రెడ్డికి స్కూల్ మేనేజ్మెంట్, నామాపూర్ గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి టీడీఎఫ్ ‘మన తెలంగాణ బడి’ ప్రాజెక్ట్ ఎంతో కృషి చేస్తున్నట్టు టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ దినేష్ అనిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి తగ్గిపోతున్న అడ్మిషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, పిల్లలకు మంచి ఫౌండేషన్ విద్యను అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహద పడుతుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు, టీడీఎఫ్ యూఎస్ఏ మాజీ చైర్మన్ గాదె గోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ విద్య పైన డీటెయిల్ రిపోర్ట్ గత సంవత్సరం నుంచి కృషి చేసి ఇటీవల ప్రభుత్వానికి అందజేసినట్టు టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
‘పోలీస్ అక్క’ ప్రాజెక్టులో భాగంగా ముస్తాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కానిస్టేబుల్ మంజుల ప్రభుత్వ పాఠశాల పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఫోక్సో యాక్ట్, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవ్ టీజింగ్ మహిళల భద్రాల చట్టాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ‘పోలీస్ అక్క’ శిక్షణ శిబిరానికి సహకరించిన ముస్తాబాద్ ఎస్సై గణేష్, పోలీస్ అక్క ఇంచార్జీ సిఐ మధుకర్కి టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నామాపూర్ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన టీడీఎఫ్ సభ్యులను సభ్యులను డిసిసి కార్యదర్శి కొండం రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజిరెడ్డి డిసిసి కార్యదర్శి కొండం రాజిరెడ్డి, టీడిఎఫ్ యూఎస్ఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ దినేష్ రెడ్డి, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, టీడీఎఫ్ యూఎస్ఏ అట్లంటా చాప్టర్ సభ్యులు వాణి గడ్డం, టీడీఎఫ్ ఇండియా మహిళా అధ్యక్షురాలు టీ వాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ రాజకీయ నాయకులు, నాగపూర్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.